- కొత్త వ్యక్తుల వివరాలు, వాహనాలు పరిశీలన
బతుకమ్మ, బోధన్ : సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలోని శక్కర్నగర్ ప్రాంతంలో బోధన్ ఎసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్న వ్యక్తుల వివరాలు సేకరించడం తో పాటు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 47 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ తెలిపారు. ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఇలాంటి కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.
