సాలూరాలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

బోధన్, బతుకమ్మ : బోధన్ గ్రామీణ పిఎస్ లో సాలూరా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. బోధన్ ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శనివారం జరిగిన కమ్యూనిటీ కాంటాక్ట్ లో 75 వాహనాలు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.