Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 October 2024, 1:42 pm Posted by : ramakrishna

 జిజిహెచ్ ను తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్

 నిజామాబాద్ , బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంద జిల్లా జనరల్ ఆసుపత్రిని రాష్ర్ట వైద్య ఆరోగ్య కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పేరుగడం, కీటక జనిత వ్యాధుల కేసులు బహిర్గతం అవుతుండటంతో వైధ్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి పరిశీలన చెపట్టింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్ జిజిహెచ్ లో పీవర్ వార్డును, ఆపరేషన్ థియేటర్, ఎమర్జేన్సీ విభాగం, బ్లడ్ సేంటర్, స్కానింగ్ సేంటర్ లను తనీఖీ చేశారు. కమీషనర్ వేంట ఆసుపత్రి సూపరింటేండేంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ తదితరులు ఉన్నారు.