Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 5:51 pm Posted by : ramakrishna

ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను గురువారం కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ వి.భుజంగరావు తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఏ.ఓ బాలరాజు, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.