అంబలికేంద్రం, చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ సంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రేట్ ప్రాంగణంలో  టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలికేంద్రం, చలివేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని, పలు సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు చలివేంద్రం మరియు అంబలి కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఏటా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీఎన్జీవోస్ సంఘానికి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు,...