సోయాబీన్ కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
బోధన్, బతుకమ్మ : వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద అన్నీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం బోధన్ మండలం చిన్నమావంది గ్రామంలో ఏర్పాటు చేసిన సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి తనిఖీ చేశారు. కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. సోయాబీన్ పంట నాణ్యత, తేమ శాతంను పరిశీలించిన కలెక్టర్ ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల సోయాబీన్ సేకరణ...