Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2024, 2:20 pm Posted by : ramakrishna

మటన్ కీమాలో బొద్దింక

. షాక్ గురైన భోజనం ప్రియులు

. మోక్ష్ హోటల్ యాజమాన్యానికి ఫైన్ విధించిన మున్సిపల్ కమిషనర్

నగరంలోని  ఎన్ టీ ఆర్ చౌరస్తాలో ఉన్న మోక్ష్ హోటల్ లో భోజనం చేస్తున్న ఒక వ్యక్తి ఆహారంలో బొద్దింక వొచ్చింది దీంతో షాక్కు గురైన సదరు వ్యక్తి మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందిని హోటల్ కి పంపించి ఫిర్యాదును పరిశీలింపజేశారు. ఆహారంలో బొద్దింక ఉందని నిర్ధారించుకొని, హోటల్ యాజమాన్యానికి నోటీస్ జారీచేశారు. కాగా 5000 రూపాయలు జరిమానా విధించినట్లు చెప్పారు. హోటల్ పరిసరాలు, ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాల నిల్వ ఉంచిన గిన్నెలపైన మూతలు ఉంచాలని కమిషనర్ ఆదేశించారు.