మద్నూర్, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామానికి చెందిన సోనోబాకు సీఎం సహాయనిధి ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సహకారంతో రూ.60 వేలు మంజూరయ్యాయి. మంజూరైన చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి డోంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారుడికి అందజేశారు.