గడువులోగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం
హైదరాబాద్, బతుకమ్మ : విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.