Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 8:18 pm Posted by : ramakrishna

సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అక్రమంగా పోలీసులు సిట్ నోటీసులు ఇచ్చి కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై నిరసనగా దిష్టి బొమ్మను దహనం చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోర్తాడ్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి జాతీయ రహదారి బస్టాండ్ వరకు నల్ల జెండాలతో నిరసన బైకు ర్యాలీ నిర్వహించి, జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

 

CM Revanth Reddy's effigy burnt