నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన షెడ్యుల్ ప్రకారం 11.45 గంటలకు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ గంట 15 నిమిషాలు ఆలస్యంగా ఒంటి గంటకు చేరుకున్నారు. ఆయనకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో ఆయన భూమారెడ్డి కన్వెన్షన్ కు బయల్దేరి వెళ్లారు.