Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2025, 12:58 pm Posted by : ramakrishna

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

రాష్ట్రానికి అన్ని విధాల చేయూత ఇవ్వాలని వినతి

వెబ్ న్యూస్,బతుకమ్మ : ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు.  గంటపాటు వీరి సమావేశం కొనసాగింది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను ప్రధానికి సీఎం వివరించారు. బీసీ రిజర్వేన్లపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి సీఎం  తీసుకెళ్లారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని, చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాల చేయూత ఇవ్వాలని విన్నవించారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు,ఉన్నతాధికారులు ఉన్నారు.