Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 6:17 pm Posted by : ramakrishna

సీఎం రేవంత్, కవిత ఇద్దరూ ఒకటే

  • ఎంపీ ధర్మపురి అరవింద్

 

నిజామాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఇద్దరూ ఒకటేనని, వారిద్దరు బిజినెస్ పార్ట్ నర్లని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నగరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకుంటే కల్వకుంట్ల కుటుంబం సహించదని అన్నారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగదొక్కిందని అన్నారు. ఫీజు రియింబర్స్ మెంట్ విడుదలను కేసీఆర్ నిలిపేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.

CM Revanth and Kavitha are the same