నిర్మల్, బతుకమ్మ :
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి, యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణా రావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ నగేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
