కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయాల చెక్కు పంపిణీ చేసిన సీఎం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటు వంటి ప్రమోద్ కుమార్ (పిసి: 1924) అక్టోబర్ 17న విధి నిర్వహణలో మరణించాడు. విధి నిర్వహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ కుటుంబానికి శుక్రవారం నిజామాబాదు జిల్లా పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమోద్ కుమార్ కుటుంబానికి ఒక్క కోటి రూపాయలు విలువగల చెక్కును అందించారు.