. . . ఎంపిడీఓ సంతోష్ కుమార్
భీంగల్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీ.ఎం కప్ టోర్నమెంట్ను అందరి బాధ్యతగా నిర్వహించాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ సూచించారు. శనివారం ఆయన మండల పరిషత్ ఆఫీస్ నుండి సీ. ఎం కప్ టార్చర్ ర్యాలీని ప్రారంభించి బడా భీంగల్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ను గైడ్ లెన్స్ ప్రకారం నిర్వహించి విజయవంతం చేయ్యాలన్నారు. ఈ భీంగల్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫీజికల్ డైరెక్టర్ రమణ సీ.ఎం కప్ గైడ్ లైన్స్ ను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ స్వామి, ఫీజికల్ డైరెక్టర్లు హేమలత, చిన్నయ్య, భూపతి, సుజాత లు, అన్ని గ్రామాల సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు.
