Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2024, 5:30 pm Posted by : ramakrishna

నాలేశ్వర్ లో స్వచ్చదనం – పచ్చదనం

బతుకమ్మ ,బోధన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు నాళేశ్వర్ గ్రామ పంచాయతి ఆవరణంలో మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బినోల సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు మాట్లాడుతు గ్రామ ప్రజలంతా స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిసరాలను, పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటే దోమలను నివారించవచ్చని తెలిపారు. ప్రతీ ఒక్కరు తమవంతుగా ఒక మొక్కను నాటి ప్రకృతిని రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిల్డ్ ఆసిస్టేంట్ కుమ్మరి రాజు,కారోబార్ భూజాంగ్ రావు,గ్రామస్థులు చిన్నదోడ్డి ప్రవిణ్,కాసారి రాజన్న,తోట పోతన్న,భిమారేడ్డి,సంజీవ్,గంగాదర్, తదితరులు పాల్గొన్నారు.