నర్సిరీల శుభ్రం.. మొక్కలకు నీరు..

బతుకమ్మ ఎఫెక్ట్.. రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో నర్సిరీల పై నిర్లక్ష్యపు నీడ, కన్నెత్తి చూడని అధికారులు గురువారం రోజున బతుకమ్మ పత్రికలో ప్రచురితమైన కథనానికి రుద్రూర్ ఎంపిడిఓ సురేష్ బాబు స్పందించి శనివారం రోజున నర్సరీలలో పెరిగిన పిచ్చి మొక్కలను, ఎండిపోయిన మొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. అలాగే వాటి స్థానంలో వేరే మొక్కలను నాటి మొక్కలకు నీరందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.