ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో సోయా రైతులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. ఈక్రమంలో బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. జోగు రామన్నను పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు.
