తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై  స్పష్టత ఇవ్వాలి

మాజీ ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్  నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఎందుకు చేశారో తమకైతే తెలువదని, కనీసం వారికి ఓటు వేసి గెలిపించిన ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ వీ. గంగాధర్ గౌడ్  పేర్కొన్నారు.  తెలంగాణ తల్లి విగ్రహం మార్పు రాష్ట్ర అస్తిత్వంపై, సంస్కృతి సంప్రదాయాలపై  దాడి చేయడమేనని ఆయన అన్నారు. ఇదివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపన్ని కాంగ్రెస్...