Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 8:34 pm Posted by : ramakrishna

కామారెడ్డి జిల్లాలో సివిల్ సప్లై కమీషనర్ పర్యటన

 

కామారెడ్డి, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి, కమీషనర్ స్టీపేన్ రవింధ్ర పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి మండలం లోని గర్గుల్ పిఎసీఎస్ ను, గోకుల్ తాండాలోని ఐకేపి కోనుగోలు కేంద్రాలను తనిఖీలు చేశారు. ధాన్యం సేకరణ లక్ష్యం చేరాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులతో స్టీపెన్ రవింధ్ర ముచ్చటించారు.

 

Civil Supplies Commissioner's visit to Kamareddy district

 

ధాన్యం కొనుగోలులో మాయిశ్చరైజర్ కష్టాలతో పాటు కోతల గురించి ఆరా తీశారు. రైతులకు ధాన్యం తాలుకు చెల్లింపులు వేగిరంగా జరిగేలా టాబ్లేట్ లలో ఓపిఎంఎస్ ల నమోదు సమాయానికి పూర్తి చేయాలని అదేశించారు. కామారెడ్డి జిల్లాలో ఈ సీజన్ లో 35,300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు. కమీషనర్ వెంట అదనపు కలెక్టర్ (సివిల్ సప్లై), డియం, డిఆర్ డిఓ, డిసిఓ, డిఎల్ ఎంఓ, ఎడి మార్కేటింగ్ తదితరులు ఉన్నారు.