Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 9:00 pm Posted by : ramakrishna

న్యాయవాదుల సహకార పరపతి సొసైటీ అధ్యుక్షునిగా చింతకుంట సాయిరెడ్డి

 

. . . కార్యదర్శిగా పడిగల వెంకటేశ్వర్

 

. . . ముగిసిన సోసైటీ ఎన్నికలు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార పరపతి సొసైటీ అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడుగా విప్లవ్ కిరణ్, కార్యదర్శిగా పడిగల వెంకటేశ్వర్, సంయుక్త కార్యదర్శిగా రవీందర్, కోశాధికారిగా శ్రీనివాస్ గౌడ్ లను ఎన్నుకున్నారు. సోసైటీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో వీరిని ఎన్నిక జరిగింది. సొసైటీ నాలుగు డైరెక్టర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా సాయరెడ్డి, సురేష్, నర్సారెడ్డి, దిలీప్ ఎన్నికయ్యారు. సొసైటీ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన సాయరెడ్డికి పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సాయరెడ్డి మాట్లాడుతూ సొసైటీ ఆర్థిక బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.