కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ఆర్మూర్, బతుకమ్మ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామ శివారులో ఉన్న పేద పిల్లలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకెపి(డిఆర్ డీ ఏ) ఏపియం లా జిల్లా అధ్యక్షుడు మాణిక్యం హాజరై ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవ కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మెన్ మహేష్ కుమార్, ట్రస్ట్ కోశాధికారి మౌనమీ, ట్రస్ట్ సభ్యులకు తదితరులు పాల్గొన్నారు.