మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలం దోన్ పాల్ గ్రామంలో గల్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది .ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ ఎం సుజాత మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ గురించి చిన్నారులకు వివరించి చెప్పారు. చక్కటి వాతావరణం లో పిల్లలకు అనువైన విధానంగా మంచి ప్రీస్కూల్ విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు కుర్చీ ఆట, కర్చిఫ్ ఆట, మిస్సింగ్ నెంబర్, వన్ మినిట్ గేమ్స్ తదితర ఆటలు ఆడించి గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందించడం జరిగింది .సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నీవల్ల అర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.