వెబ్ డెస్క్, బతుకమ్మ : అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ (85) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన ఇటీవల లఖ్ నవూ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు గురువారం సరయూ నది ఒడ్డున నిర్వహించనున్నట్లు ఆయన శిష్యుడు ప్రదీప్ దాస్ తెలిపారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో ఆయన తాత్కిలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సమయంలో కీలక పాత్ర పోషించారు.