బతుకమ్మ పిట్లం : మరాఠ యోధుడు, హిందూ సామ్రాట్, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించిన ధీరుడు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలను బుధవారం పిట్లం మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. హిందూ సంఘాలు, ఆయా పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. నేషనల్ హైవే పక్కన ఉన్న చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలు వేసి జయంతి వేడుకలను ఘనంగా అనంతరం గ్రామంలోని ప్రధాన విధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు మండలంలోని ధర్మారం, గ్రామాల్లో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో, విశ్వ హిందూ పరిషత్, అశోక్ రాజ్, శ్రీశైలం, కృష్ణవంశీ, హిందూ సంఘాల నాయకులు,యువకులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
