ఘనంగా చత్రపతి శివాజీ జయంతి
భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండల కేంద్రంలో రామదండు ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి గురువారం ఘనంగా నిర్వహించారు. రామదండు సభ్యులు మాట్లాడుతూ తన మతాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో రాజ్యాన్ని పాలించిన లౌక్యపాలకుడు, దిశాలి రాజనీతిజ్ఞుడు, పటిష్టమరాట సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన యోధుడు, గెరిల్లా యుద్ధానికి జన్మనిచ్చిన వీరుడు అని కొనియాడారు. నేటి యువత హృదయాల్లో నిలిపే ఆదర్శంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, రమేష్, తునికి వేణు, నరేష్, పరమేష్,...