బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మోర్తాడ్ ఎంపీడీవో తిరుమల దేవి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనమును ఆమె తనిఖీ చేశారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో చదివించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధర్, కార్యదర్శి సంతోష్, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
