కస్తూర్బా బాలికల విద్యాలయం తనిఖీ
బతుకమ్మ జుక్కల్ : జుక్కల్ మండలం లోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సోమవారం జుక్కల్ ఎమ్మార్వో హిమబిందువు తనిఖీ చేశారు. బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాలని ఆమె కోరారు. కూరగాయలు తాజాగా ఉండాలని ఆదేశించారు. టీచర్లు సమయపాలన పాటించి విద్యాబోధన చేయాలని ఆదేశించారు. గురుకుల బాలికల విద్యార్థినులకు సమయపాలన పాటించి విద్యాబోధన చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామారావు, కస్తూర్బా గాంధీ ప్రిన్సిపాల్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.