సీఐ విజయ్ బాబుకు చార్జి మెమో

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మహిళపై దాడి చేశాడనే ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుకు పోలిస్ కమిషనర్ సాయి చైతన్య చార్జి మెమో ఇచ్చారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లోనీ జానకంపేట లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో సీఐ తనపై అకారణంగా దాడి చేశారని బోయి భాగ్య అనే మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ అనంతరం క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా సీఐ విజయ్ బాబుకు చార్జి మెమో ఇచ్చారు.