దుర్గామాత వద్ద చండీయాగం, అన్నదానం

డిచ్ పల్లి, బతుకమ్మ : డిచ్ పల్లి మండలంలోని ఘన్ పూర్ గ్రామంలో దుర్గామాత వద్ద ఆదివారం చండీయాగం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ.. పాడిపంట, పిల్లల ఆరోగ్యం, పశువులకు గలీకుంటూ, ఎవరికి ఎటువంటి హాని కలవద్దని ఈ చండీయాగం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గా మాత సేవ కమిటీ, వీడీసీ, మహిళలు, యువకులు, మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.