Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2025, 4:00 pm Posted by : ramakrishna

7న ఛలో హైదరాబాద్

బతుకమ్మ, జుక్కల్ : ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించే లక్ష డప్పులు.. వేయి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు అయిల్ వారి మారుతి మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ కోసం పద్మాశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారని తెలిపారు. మాదిగ, మాదిగ ఉపకులాలు  పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ  కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ యూత్ కార్యదర్శి రవికుమార్, ఉపా అధ్యక్షులు బాలాజీ మాదిగ, మండల కార్యదర్శి సూర్యకాంత్ మాదిగ, సలహాదారులు పండరి మాదిగ,  సోముదాదాస్  మాధవ్, జిజభాయ్ లక్మి భాయీ, పెరభాయి, చంద్ర భాయి, సాయిలు మాదిగ ఎమ్మార్పీఎస్ తదితరులు పాల్గొన్నారు.