బాన్సువాడ, బతుకమ్మ : చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషిచేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఐలమ్మ విగ్రహానికి పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
