ఉత్తమ ఉద్యోగిగా ఆర్ఐ రంజిత్ కు ప్రశంసా పత్రం

బతుకమ్మ,మోర్తాడ్: జిల్లా కేంద్రంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చేతుల మీదుగా మోర్తాడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రంజిత్ కుమార్ ఉత్తమ ఉద్యోగి గా ప్రశంసా పత్రం అందుకున్నారు. దీంతో మోర్తాడ్ తాసిల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తాసిల్దార్ సుజాత ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా మోర్తాడ్ తాసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగులంతా మిఠాయిలు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిబ్బంది ఏ ఆర్ ఐ పతాని లింగం, నరేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.