ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట్ లో సి సి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయినాయి. గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ నిధుల కింద 5 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. గ్రామానికి సి సి రోడ్డు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, ఎంపీడీఓ ప్రకాష్,గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రసాద్,అధికార ప్రతినిధి గోపి కృష్ణ,శంకర్, కిషన్,హన్మాండ్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.