ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక శ్రద్ధతో ఆదివారం వెల్లుట్ల పేటలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, గోచిక గణపతి, సుతారి సాయిలు, కొయ్యల రాజా గౌడ్, పెంట అంజయ్య, కరిచెవుల రాజు, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ మల్లేష్, గ్రామ ప్రముఖులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.