Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2025, 5:48 pm Posted by : ramakrishna

సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం

నిజామాబాద్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా విద్యార్థులు ఉదయమే పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు. ప్రధానంగా నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్, నవ్యభారతి, ఎస్ఎస్ఆర్ అంతర్జాతీయ పాఠశాలలు ఈ పరీక్షలకు ప్రాముఖ్యత కలిగిన కేంద్రాలుగా మారాయి. నాలెడ్జ్ పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కరస్పాండెంట్ సయ్యద్ ముజీబ్ అలీ మాట్లాడుతూ, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే ఈ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణ, కృషి అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సంబంధిత స్కూల్ యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశాయి. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు స్కూల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మరికొన్ని వారాల పాటు కొనసాగనున్న ఈ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే కీలక దశగా పరిగణించబడుతున్నాయి.

CBSE Class 10th Board Exams Begin