అమెరికా వెళ్లేందుకు ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కోర్టు అనుమతి
16 న అమెరికా కు కల్వకుంట్ల కవిత బతుకమ్మ, వెబ్ డెస్క్ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అమెరికా వెళ్లేందుకు ఢిల్లీలో రౌస్ ఎవెన్యూ సీబీఐ కోర్టు అనుమతిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16న అమెరికాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యూయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి కోర్టు అనుమతి కోరగా అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 16 నుంచి 23 వరకు కవిత దంపతులు అమెరికా వెళ్లనున్నారు.