Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2024, 5:58 pm Posted by : ramakrishna

వరద తగ్గేవరకు భవానిపేట్ – పోతారం గ్రామాల మధ్య కాజ్ వే మూసివేత

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ 

బతుకమ్మ, కామారెడ్డి : వరద తగ్గేవరకు భవానిపేట్ – పోతారం గ్రామాల మధ్య కాజ్ వే ము మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ పాల్వంచ మండలంలోని భవానిపేట్ – పోతారం గ్రామాల మధ్య కాజ్వే నుండి ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాల వలన కాజ్వే పై నుండి ప్రమాదకరంగా నీరు పారుతోందని ఎలాంటి ప్రాణనష్టం కలగకుండా నీటి ప్రవాహం తగ్గేవరకు ముందస్తుగా కాజ్ వేకు ఇరువైపులా బారికేడింగ్ చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తాసిల్దార్ జయంత్ రెడ్డిని ఆదేశించారు. అంతకుముందు జక్కుల చెరువు అలుగును పరిశీలించి చెరువు నుండి వచ్చే వాటర్ వలన కింది గ్రామానికి ఏమైనా సమస్య తలెత్తుతుందా అని అడిగి ఏదైనా సమస్య వస్తే వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట కామారెడ్డి ఆర్డీవో రంగనాథరావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో గోపి బాబు, పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.