టోల్ ప్లాజాల్లో నగదు రహిత చెల్లింపులు
భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు తో పాటుగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలో ఏప్రిల్ 10 నుండి నగదు రహిత చెల్లింపులు మాత్రమే అనుమతించడం జరుగుతుందని భిక్కనూరు టోల్ ప్లాజా మేనేజర్ దుర్గా ప్రసాద్, ముని ప్రకాష్ తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ సంపూర్ణ డిజిటల్ జాతీయ రహదారి టోల్ నివాసము అభివృద్ధి చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల టోల్ ప్లాజాలలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారుల టోల్ ప్లాజా లో టోల్...