Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 6:39 pm Posted by : ramakrishna

పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో పదవ తరగతి ఫలితాలలో ప్రతి స్కూల్ నుండి (జిల్లా పరిషత్ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, కేజీబీవీ పాఠశాల, జీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో) మొదటి, రెండు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రూ.2500 &  రూ. 1500 నగదు బహుమతి, కాలేజీ బ్యాగ్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ లు అందజేశారు. అనంతరం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, రైడ్స్ అధ్యక్షులు కర్రోళ్ల కృష్ణ ప్రసాద్, రుద్రూర్ పూర్వ విద్యార్థి వంశీ హై స్కూల్ డైరెక్టర్ కిలారు పద్మజ విజయ్ కుమార్, రైడ్స్ సభ్యులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.