ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులను వేగంగా విచారణ చేపట్టాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : షెడ్యూల్డ్ కులాలు, తెగలపై జరిగే దాడులకు సంబంధించిన నమోదైన కేసులపై వేగవంతంగా విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే దాడులకు సంబంధించి నమోదైన కేసులపై విచారణ వేగవంతం చేయాలని, బాదితులకై సత్వర న్యాయం అందించేందుకు...