భీమ్ గల్, బతుకమ్మ : అజాగ్రత్త, వేగంగా ట్రాక్టర్ ను నడిపి స్కూటీ పై వస్తున్న ఓ వ్యక్తిని డీకోట్టి తీవ్ర గాయల పాలు చేసిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసిన ఘటన భీమ్ గల్ పట్టణ కేద్రం లో జరిగింది. ఎస్సై కథనం ప్రకారం గురువారం సాయంత్రం అబుహజం స్కూటి పై వెళ్తుండగా ముచ్కూర్ చౌరస్తా వద్ద లింగేశ్వర్ ట్రాక్టర్ నంబర్ టీ. ఎస్.01ఏ. యు.1084 ను అతివేగంగా ,అజాగ్రత్తగా నడిపి అబుహజం స్కూటి కి ఢీ కొట్టాడు. దాంతో అబుహజం కింద పడి గాయాలు పాలు అయ్యారు. అతివేగంగా, అజాగ్రత్తగా ట్రాక్టర్ ను నడిపినా లింగేశ్వర్ పై చర్య తీస్కోవాలని క్షతగాత్రుడు అబుహజం వాళ్ల తాత ముఖీద్ ఫిర్యాది చెయ్యగా, ఫిర్యాదుదారు ఫిర్యాదు మేరకు లింగేశ్వర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.