పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై కేసు

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ భవన్లో పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. మహా న్యూస్ దాడి ఘటన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీ ఆర్ ఎస్ వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్టు సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ విధులను  అడ్డుకున్నారంటూ బంజారా హిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బీ ఆర్ ఎస్ నేతలు మధుసూదనాచారి, బాల్క సుమన్ తో సహా పలువురు నేతలపై కేసు నమోదు చేశారు.