బోధన్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాలు జరగుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా మంగళ ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆచంపల్లి ఎక్స్ రోడ్ బ్లాక్ స్పాట్ ని వివిధ శాఖల సమన్వయంతో సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, బోధన్ టౌన్ సిఐ వెంకట్ నారాయణ, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, జాతీయ రహదారి ఏ ఈ ఈ సతీష్, ఐరాడ్ జిల్లా మేనేజర్ వర్షా నిహాంత్ పాల్గొని అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు.