. . . మెదక్ జిల్లాలో ఘటన
. . . కారులో నలుగురు ఉన్నట్టు సమాచారం
మెదక్, బతుకమ్మ :
మెదక్, కామారెడ్డి జిల్లాలో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల పరిధిలో జాతీయ రహదారిని మూసి వేశారు. బుధవారం మెదక్ జిల్లాలో ఒక కారు వాగులో కొట్టుకొని పోయింది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు నలుగురు ప్రయాణికులు ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఒడ్డున ఉన్న ప్రజలు కాదు దిగాలని , ప్రాణాలు కాపాడుకోవాలి చేపుతున్న కారు మాత్రం దిగలేదు అని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.