Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 11:59 am Posted by : ramakrishna

కుక్కను తప్పించబోయి కారు బోల్తా

జంగంపల్లి ఎన్ హెచ్ 44 హైవే వద్ద ఘటన

ఐదుగురికి తీవ్ర గాయాలు

భిక్కనూరు, బతుకమ్మ : భిక్కనూరు మండలం జంగంపల్లి ఎన్ హెచ్ 44 హైవే పై కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయికల్ మండల్ కమ్మరి పల్లి చెందిన రాజశేఖర్, సాయి కుమార్ ఖతర్ దేశం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు.  వారు శంషాబాద్ నుంచి ఇంటికి వస్తుండగా జంగంపల్లి వద్ద అడ్డువచ్చిన కుక్కను తప్పించే క్రమంలో కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న భిక్కనూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ బొమ్మేన సాయి కుమార్(పిప్రి), రాజశేఖర్ కమ్మరిపల్లి), లక్ష్మి(పిప్రి), మాసం సాయి కుమార్(ఆర్మూర్), మహిపాల్(బడా భీంగల్) ను అంబులెన్స్ ద్వారా కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Car overturns while trying to save dog