Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 9:09 pm Posted by : ramakrishna

జంగంపల్లి గ్రామ శివారులో కారు బోల్తా

 

. . . నలుగురికి గాయాలు

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో కృష్ణ మందిర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడడంతో నలుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు గాయపడగా వారిని వాహనదారులు పోలీసులు కారులో నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం కామారెడ్డికి తరలించారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.