Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2025, 10:59 am Posted by : ramakrishna

ఎదురెదురుగా ఢీకొన్న కారు, డీసీఎం : ముగ్గురి మృతి

హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరు వద్ద ఘటన

హయత్ నగర్, బతుకమ్మ : కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈఘటన బుధవారం హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరు వద్ద జరిగింది. మృతులను కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనా రెడ్డి (24), చుంచు త్రినాథ్ రెడ్డి(24), చుంచు వర్షిత్ రెడ్డి (23) గా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈప్రమాదంలో గాయపడిన మరోవ్యక్తి  అలిమేటి పవన్ కల్యాణ్ రెడ్డిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.