నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ 2024 (పోలీసు ఫ్లాగ్ డే) ను పురస్క రించుకొని నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధూ శర్మ ఆదేశాలమేరకు అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) కోటేశ్వర రావు ఆధ్వర్యంలో సోమవారం ” క్యాండిల్ ర్యాలీ” కార్యక్రమం నిర్వహించారు. ఈ క్యాండిల్ ర్యాలీ ఎల్.ఐ.సి చౌరస్తా నుండి ప్రారంభించి మున్సిపల్ ఆఫీసు – ఎన్.టి.ఆర్ చౌరస్తా -పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ ( ఎ.ఆర్ ) శంకర్ నాయక్, ట్రాఫిక్ ఎ.సి.పి నారాయణ, ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి నాగయ్య, టౌన్ సి.ఐ శ్రీనివాస్ రాజ్, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ సతీష్ కుమార్, తిరుపతి, శ్రీనివాస్, ఎన్.ఐ.బి ఇన్స్పెక్టర్ ప్రసాద్, సి.ఐలు, ఎస్.ఐలు 1,2,3,4,5,6, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బస్సా ఆంజనేయులు, కోశాధికారి కర్పె రవీంధర్ , పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
